వెంగళరావునగర్, ఆగస్టు 26 : తాము సీసీఎస్ పోలీసులమని చెప్పి అమీర్పేటలో ఓ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడ్ని బెదిరింది రూ.20 వేలు వసూలు చేసిన ముగ్గురిని ఎస్.ఆర్.నగర్ పోలుసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్పేట ఆదిత్యా ఎన్క్లేవ్లోని అన్నపూర్ణ బ్లాక్లో నెం106 ఫ్లాట్లో ఫస్ట్ స్టోన్ టెక్నాలజీస్ పేరిట నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు నూకల రమేష్బాబును ఈ నెల 23వ తేదీన ఇన్స్టిట్యూట్కు వచ్చి సీసీఎస్ పోలీసులమని చెప్పి అనుమతులు లేవని బెదిరించి రూ.2 లక్షలు డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకుని వెళ్లిపోయారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు వచ్చిన వ్యక్తుల్లో కవాడిగూడకు చెందిన ఓ బీజేపీ నేత కుమారుడు భరత్, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్కు చెందిన (ప్రస్తుతం సెంట్రలో జోన్ ఓ అధికారి) వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్ విక్రమ్, సైదాబాద్ నివాసి సాయికృష్ణలుగా గుర్తించారు. గురువారం నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.