హైదరాబాద్: నగర శివార్లలోని బండ్లగూడలో దొంగలు హల్చల్ చేశారు. బండ్లగూడలోని ఇంద్రప్రస్తకాలనీలో ఉన్న మూడిళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటినతర్వాత ఇండ్లలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.3 లక్షలు, రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.