సూర్యాపేటసిటీ, ఏప్రిల్ 9 : ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు. డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సూర్యాపేట నుంచి పాల్గొన్నారు. కరోనా వైరస్ కట్టడికి జిల్లా పోలీసు సిబ్బంది ముందు వరుసలో ఉండి పని చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది మాస్క్ వినియోగం, వ్యాక్సినేషన్, భౌతికదూరం పాటించడం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని డీజీపీకి వివరించారు. ప్రజలు గుంపులుగా చేరవద్దని, అనవసర పార్టీలు, విందులు నిర్వహించవద్దని సూచిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్కు , బజారుకు వెళ్లేటప్పుడు, వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు, జన సమూహంలో తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా, మాస్కు లేకుండా బయట తిరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిమానా తప్పదని ఎస్పీ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రఫేల్ డీల్తో దేశానికి రూ 21,000 కోట్ల నష్టం : కాంగ్రెస్