సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): మహా నగరంలోని చారిత్రాత్మక పీవీ మార్గ్లో మరో పర్యాటకం వచ్చి చేరనుంది. హైదరాబాద్ మహా నగరంలో అన్ని వయసుల వారిని ఆకట్టుకునే విధంగా నిర్మితమైన అత్యాధునిక థీమ్ పార్ థ్రిల్ సిటీని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో కూడిన ఆదర్శవంతమైన వినోద ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసినట్లు థ్రిల్ సిటీ డైరెక్టర్ ఎస్.రజనీకాంత్ తెలిపారు. పీవీ మార్గ్లోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన నిర్మించిన ఈ థీమ్ పార్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఇది నిర్మించబడిందని ఆయన వివరించారు. వివిధ సాహస క్రీడల (గేమింగ్)తో థ్రిల్ పొందే ఔత్సాహికులందరికీ ఈ థ్రిల్ సిటీ ప్రారంభం నిజంగా పర్యాటకులకు ఒక శుభవార్త అని డైరెక్టర్ రజనీకాంత్ అన్నారు. రైడింగ్ మాన్స్టర్ థియేటర్, స్ప్లాష్ కోస్టర్, ఫె్లైట్ సిమ్యులేటర్లు, సోడా కార్ డైవర్, ట్రైనింగ్ సిమ్యులేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, బంపర్ కార్లు, ఫుట్బాల్, మ్యాజిక్ ట్రైన్, హార్స్ రంగులరాట్నం, ఇలా అనేక గేమింగ్ జోన్లతో పాటు వివిధ రకాల రుచికరమైన ఆహారం (ఫుడ్ కోర్ట్లు)లు కూడా నగర ప్రజలను మెప్పించే రీతిలో ఏర్పాటు చేసినట్టు వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా సుదీర్ఘ సమయం ఇండ్లకే పరిమితమైన అనేక మంది హైదరాబాద్ నగర ప్రజలను కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్న అలాంటి వారు రోజంతా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపేందుకు థ్రిల్ సిటీ ఒక వేదిక కానున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా రజనీకాంత్ తెలిపారు.