బీటెక్లో ఈఈఈ చేశాడు.. ఆ పరిజ్ఞాణాన్ని దొంగ బుద్ధులకు ఉపయోగించి.. కార్ల దొంగగా మారాడు.. ఇలా దాదాపు రూ.70 లక్షల విలువ చేసే కార్లు, బైక్లను చోరీ చేశాడు.. తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగ ఎట్టకేలకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కాడు.. నిందితుడి నుంచి 6 కార్లు, రాయల్ ఇన్ఫీల్డ్ బైక్ను స్వాధీనం చేసుకున్నా రు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు…
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా సీసాలి గ్రామానికి చెందిన మహేశ్ నూతన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి మొబైల్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. యాప్ల ద్వారా రూమ్ షేరింగ్ను చూసుకుంటాడు. ఆ తర్వాత అందులో చేరి.. రూమ్మేట్ ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా తదితర ప్రతాలను చోరీ చేస్తాడు. ఆ తర్వాత వాటితో ఇతర రాష్ర్టాలకు వెళ్లి అక్కడ కార్లు, బైక్లను అద్దెకు తీసుకుంటాడు. వాటికి జీపీఎస్తో పాటు ఇతర పరికరాలను తొలిగించి.. నంబర్ప్లేట్ మా ర్చి తిరుగుతుంటాడు. అవకాశం వస్తే వాటిని తక్కువ ధరకు కూడా అమ్మేస్తాడు. ఇలా మహేశ్ 2017 నుంచి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు. తాజాగా.. 2020లో బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కార్లను చోరీ చేశాడు. మాదాపూర్లోని జూమ్ సంస్థ నుంచి ఓ కారు ను అద్దెకు తీసుకుని పారిపోవడంతో ఆ సంస్థ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం నిందితుడు మహేశ్కుమార్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని పట్టుకున్న అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డులను అందించారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ సందీప్, శంషాబాద్ ఎస్ఓటీ బృందం, మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు