సుల్తాన్బజార్,డిసెంబర్ 6 : టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా 8వ స్పోర్ట్మీట్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో డెంటల్ కాలేజీ యూనిట్ టీం విజయం సాధించింది. డెంటల్ కాలేజీ యూనిట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ యూనిట్ టీంల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్లో డెంటల్ కాలేజీ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా, మంగళవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 8వ స్పోర్ట్మీట్-2022 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి.
ఈ ముగింపు వేడుకలకు తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇసాక్, టీఎస్ఈ డబ్ల్యూడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, శ్రీని డెవలపర్స్ అధినేత శ్రీనివాస్రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ మాట్లాడుతూ.. 8వ స్పోర్ట్ మీట్-2022 విజయవంతంగా ముగిసేలా సహకరించి న ఎల్బీ స్టేడియం నిర్వాహకులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆటల పోటీలను ఘనంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, ఉపాధ్యక్షులు కురాడి శ్రీనివాస్, ఉమర్ఖాన్, సంయుక్త కార్యదర్శి ఖలీజ్ అహ్మద్,ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర, టీజీవో జిల్లా శాఖ సభ్యుడు జూపల్లి నర్సింగ్రావు, తదితరులు పాల్గొన్నారు.