బేగంపేట్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ…పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు.
పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయని వివరించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగ నిలిచిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహే శ్వరి, లక్ష్మీబాల్రెడ్డి, తహసిల్థార్లు బాలశంకర్, చంద్రకళ, మాజీ కార్పొరేటర్లు తరుణి, శేషుకుమారి, అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.