గోల్నాక, ఆగస్టు 19 : కరోనా కష్ట కాలంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం అంబర్పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 103 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ..ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ సాయిరాజు, రెవెన్యూ అధికారులు బీవీ.మహేష్రాజు, రాము, బద్రినాథ్, టీఆర్ఎస్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, సంతోష్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.