బ్యాలెట్ పత్రాల ముద్రణ సరిగా ఉండాలి
ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
వరంగల్, ఏప్రిల్ 23 : చాలాకాలం తర్వాత బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్ర ణ సరిగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ పమే లా సత్పతితో కలిసి ఆయన పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ ప త్రాల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోటాతో కలిపి ఎనిమిది మంది అభ్యర్థులకు మించితే అదనపు బ్యాలెట్ ముద్రించాలన్నా రు. ఎన్నికల నిబంధనలకనుగుణంగా బ్యాలెట్ పత్రాల్లో గుర్తుల సైజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. బ్యాలెట్ పత్రాల్లో అక్షర దోషాలు లేకుండా ఆయా డివిజన్ల ఆర్వోలు చూసుకోవాలన్నారు. మూడు ప్రింటిం గ్ ప్రెస్లలో బ్యాలెట్ పత్రాలు ముద్రిస్తున్నామని సక్రమంగా జరిగేలా ఇద్దరు డిప్యూటీ కమిషనర్లకు పూర్తి బాధ్యతలు ఇస్తున్నామన్నారు. అదనపు కమిషనర్, టౌన్ప్లానింగ్ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, డీసీపీ గణపతి, ఆర్డీవో శ్రీనివాస్కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ.. వ్యాక్సిన్ ఫ్రీ