సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యాకర్తల యంత్రాంగాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో పార్టీ కమిటీలను నియమించినట్లు తెలిపారు.
ప్రధాన కమిటీలతో పాటు మహిళా, యువజన విభాగాలతో పాటు అన్ని అనుబంధ కమిటీలు, బూత్ స్థాయి, బస్తీ, సోషల్ మీడియా, కాలనీ విభాగాలను కూడా పూర్తి స్థాయిలో నియమించడం జరిగిందన్నారు. ఈ మేరకు నియోజ కవర్గంలో పార్టీ నిర్మాణానికి సంబంధించిన వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్కు అందజేశారు.