అమీర్పేట్ : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. కొవిడ్ కారణంగా గత రెండు సంవత్పరాలుగా వరల్డ్ ఎల్డర్స్ డే వేడుకలను నిర్వహించలేపోయిన ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆ వేడుకలను బుధవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్లో 70 నుండి 75 వసంతాలు పూర్తి చేసుకున్న 17 మంది సభ్యులను కౌన్సిల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ వయోభారంతోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రతినిధులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వయోభారం శాపం కాదని రుజువు చేస్తూ నిరంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఇండోర్ గేమ్స్, యోగా, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యకలాపాలతో తమను తాము బిజీగా ఉంచుకుంటూనే వృద్ధాప్య మాధుర్యాన్ని తోటి వారితో కలిసి ఆనందిస్తుండడం ఇక్కడి కౌన్సిల్ ఆవరణలో కనిపిస్తుందన్నారు. వయోధికుల సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు తన వంతు తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణీదేవి చేతుల మీదుగా కౌన్సిల్ అధ్యక్షులు కాసాని సహదేవ్గౌడ్, కౌన్సిల్ మాజీ అధ్యక్షులు డి.పార్థసారధి (రిటైర్డ్ఐఆర్ఎస్), ప్రధాన కార్యదర్శి డి.అనంతరెడ్డి, ప్రతినిధులు జి.యాదగిరి, జె.కృష్ణదేవ్గౌడ్, టి.ముత్తారెడ్డి, ఎ.బిచ్చప్ప, ఎమ్.నర్సింహమూర్తి, వై.నర్సింహారెడ్డి, వి.విఠల్రెడ్డి, ఎంఎస్ఎన్ రాజు, జి.మాధవరెడ్డి, టి.కిషన్ తదితరులున్నారు.