కవాడిగూడ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలో హనుమాన్ టెంపుల్ వద్ద భోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమ స్పూర్తి ప్రదాత, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముందుగా బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా తొలిదశ మలిదశ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన మహనీయుడు ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన కొనియాడారు. ఆయన స్పూర్తితోనే నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.
మహనీయుల జయంతి, వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమని అన్నారు. మహనీయులను సీఎం కేసీఆర్ ఎన్నడూ మరిచిపోరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భోలక్పూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్ రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఏ. శంకర్ గౌడ్, కృష్ణ, నారాయరాణ, కేఎం సాయి, సుధాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు