బంజారాహిల్స్,ఆగస్టు 17: భార్యతో విడిపోయానన్న బెంగతో డిప్రెషన్లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లో నివాసం ఉంటున్న ఆదిత్యసాయి డాగా(28) వ్యాపారం చేస్తుంటాడు.
ఇటీవల భార్యతో విభేదాలు రావడంతో ఆరు నెలల క్రితం విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి డిప్రెషన్లో ఉన్న ఆదిత్య సోమవారం సాయంత్రం గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికి కుటుంబ సభ్యులు గమనించి దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి సాయిలాల్ డాగా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.