న్యూఢిల్లీ: ఇండియా ఓవర్సీస్ సిటిజన్ (ఓసీఐ) కార్డుల జారీ ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల్లోని భారత సంతతి పౌరులకు ఓసీఐ కార్డులను తిరిగి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు, వారి జీవిత భాగస్వాములు, ఓసీఐ కార్డు హోల్డర్లకు చాలా ప్రజాదరణ పొందిన కార్డుగా ఓసీఐ కార్డు నిలిచింది. ఈ కార్డు దారులు స్వేచ్ఛగా భారతదేశంలో అపరిమిత కాలం నివసించేందుకు అనుమతి ఇస్తుంది.
ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 37.72 లక్షల ఓసీఐ కార్డులు జారీ చేసింది. ఓసీఐ కార్డు ఒక దీర్ఘకాలిక వీసా కావడంతోపాటు అపరిమిత కాలం దేశంలో నివాసం ఉండేందుకు వెసులుబాటు కలిగిస్తుంది. దీనివల్ల ఇతర దేశాల వారితో పోలిస్తే పలు ప్రధాన బెనిఫిట్లు పొందొచ్చు.
ప్రస్తుతం 20 ఏండ్ల వయస్కులు మొదలు 50 ఏండ్లు పూర్తయిన వారికి ప్రభుత్వం ఓసీఐ కార్డులు తిరిగి ఇవ్వనున్నది. అప్లికెంట్లో బయాలజికల్ మార్పుల నేపథ్యంలో తిరిగి ఓసీఐ కార్డులు జారీ చేయాలని కేంద్రం తలపెట్టింది.
20 ఏండ్ల వయస్సు నిండిన వారికి నూతన పాస్పోర్ట్ జారీ అయిన తర్వాత ఓసీఐ కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే, ఓసీఐ కార్డు కోసం వారు తమ నూతన పాస్పోర్ట్, ఫొటోలు, ఆన్లైన్లో లోడ్ చేయాల్సి ఉంటుంది.
పెండ్లయిన వారి భాగస్వాములు మూడు నెలల్లో కొత్త ఓసీఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. నూతన పాస్పోర్ట్ జారీ అయ్యేందుకు ఫైనల్ అకనాలెడ్జ్మెంట్ కోసం ఫైల్స్ అప్లోడ్ చేశాక దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగొచ్చు. ఓసీఐ కార్డు దారులకు పలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
కొవిడ్పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ
‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్
వాట్సాప్లో ఈ ట్రిక్స్ తెలుసా?
బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం
ఫ్లిప్కార్ట్ చేతికి క్లియర్ ట్రిప్
ఆదాయంలో అంచనాలు దాటిన విప్రో
ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు