ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 20: పేద ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి అన్నారు. మండల పరిధి అవుషాపూర్ గ్రామంలో వైఎస్రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజల కోసం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వైఎస్ రెడ్డి ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదుకోవడం అభినందనీయమన్నారు. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 16 సార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్విహించి మందులు పంపిణీ చేయడం అతని సేవాతత్వానికి నిదర్శనమన్నారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సరైన అవగాహన లేక ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారని, వారి సమస్యల పరిష్కారం క్సోం ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలకు నిరంతర సహకారం అందిస్తూ వెన్నంటి ఉంటున్న ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరంలో 328 మంది రోగులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు, ఎస్సై ధనుంజయ, ఉప సర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు మల్లేశ్, వీరేశం, రవినాయక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మచ్చేందర్రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, బాలకృష్ణ, దయాకర్ రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.