హైదరాబాద్: సికింద్రాబాద్లో ఇంటి యజమానిని కిరాయికి ఉంటున్న వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అల్వాల్లోని హస్మత్పేటలో మంగతాయారు (72) అనే వృద్ధురాలికి ఇళ్లు ఉన్నది. ఆ ఇంట్లో సురేశ్ అనే వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు. అయితే ఆమెను హత్య చేసి బాత్రూమ్లో దాచిపెట్టాడు. కాగా, వృద్ధురాలు కనిపించకుండా పోవడంతో బంధువులు నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కిరాయికి ఉంటున్న సురేశ్ ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సురేశ్ను అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే ఆమె హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.