హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): గాలిలో ధూళి కణాలు (పార్టికల్స్ మ్యాటర్) అధిక మోతాదులో ఉన్న నగరాల్లో జీవించేవారికి కొవిడ్ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఉత్కల్ యూనివర్సిటీ (భువనేశ్వర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలాజీ (పుణె), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (రూర్కెలా), ఐఐటీ-భవనేశ్వర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 721 జిల్లాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో పీఎం 2.5 లెవల్స్కు, కొవిడ్ లాంటి అంటువ్యాధులకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తేలింది. పీఎం లెవల్స్ అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటక, ఒడిశాలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ముఖ్యంగా శిలాజ ఇంధన కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లోనే కొవిడ్ కేసులు, మరణాలు ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
అధ్యయన వివరాలు