కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాధిగ్రస్తులకు సంబంధించిన బయో వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పోగవుతున్నాయి. కొద్ది రోజుల వరకు మూసి ఉన్న కొవిడ్ దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లు తిరిగి తెరుచుకుంటుండటంతో ప్రతిరోజు వ్యర్థాలు టన్నుల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ఈ క్రమంలో వైద్యశాలలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రయోగశాలలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బయోవ్యర్థాల నిర్వహణ, పాటించాల్సిన నియమ నిబంధనలపై పీసీబీ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.