వ్యవసాయ యూనివర్సిటీ: కోత దశలో ఉన్న మిర్చి పంటలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు సాధించవచ్చని ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిరోషా అన్నారు. పంట చివరి దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. తెలంగాణలో పండే మిర్చికి భారీ డిమాండ్ ఉంది. మిరప సాగులో తెలంగాణది రెండో స్థానం. అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకొని ఎగుమతులు పెంచాలంటే పంట కోత, శుభ్రపర్చే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాధారంగా సాగు చేస్తే మూడు నుంచి నాలుగు, నీటి ఆధారంగా సాగు చేస్తే ఆరు నుంచి ఎనిమిది కోతలు మాత్రమే కోయాలి.