తెలంగాణ శకుంతల పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచి ఆమె ఫొటోనే ప్రొఫైల్గా వాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రముఖులపై ట్వీట్లు చేస్తున్న వారిపై సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఒక పథకం ప్రకారం ఆ ఖాతా నుంచి ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారని సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.