హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట ఏసీపీగా పనిచేస్తున్న పి నరేశ్రెడ్డిని మల్కాజ్గిరి ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస్తుతం మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేస్తున్న ఎన్ శ్యామ్ప్రసాద్రావును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
హైదరాబాద్ సీసీఎస్లో ఏసీపీగా పనిచేస్తున్న బి రవీంద్రరెడ్డి.. సంగారెడ్డి ఎస్డీపీఓ(సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్)గా బదిలీ చేశారు. ప్రస్తుతం సంగారెడ్డిలో ఎస్డీపీఓగా పనిచేస్తున్న ఏ బాలాజీని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా వైరా ఏసీపీగా రహమాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న సత్యనారాయణను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.