మెహిదీపట్నం జూన్ 5 : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని.. ఆధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి… పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర కమిషనర్ అంజనీకుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ గుప్తా, ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమం త్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసింగ్ వ్యవస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని అన్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ తన పనితీరుతో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని అన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం నగరంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా 100 డయల్కు కాల్ చేయగానే 5 నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దుతున్నారని తెలిపారు. మహిళల రక్షణకు పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చౌహాన్, శిఖా గోయల్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ శివమారుతి, ఆసిఫ్నగర్ ఇన్స్పెక్టర్ నాగం రవీందర్, టీఆర్ఎస్ కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల ఇన్చార్జిలు సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్, జీవన్ సింగ్, ఎంఐఎం నాయకులు ఎండీ మూసా, డాక్టర్ ఖాసీం రులు పాల్గొన్నారు.