వనస్థలిపురం, సెప్టెంబర్ 5 : వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హోమియోపతి కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యులకు మన సంప్రదాయంలో, సమాజంలో ఎంతో గౌరవం ఉందన్నారు.
వైద్యులు సేవా ధృక్పదంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఫార్మా రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. అందుకే దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందన్నారు. నిర్వాహకులు డాక్టర్ శారద, డాక్టర్ వెంకట్రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు.