పౌర సరఫరాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి గంగుల కమలాకర్ అన్నా రు. నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ఆదివారం సాయంత్రం తెలంగాణ రేషన్ డీలర్ల హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించా రు. రేషన్ డీలర్ల సంక్షేమం కోసం ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని క్షేత్ర స్థాయిలో అమలుపరుస్తున్న వారియర్స్ రేషన్ డీలర్లని కొనియాడారు. కొవిడ్ సం క్షోభంలోనూ ప్రజలందరికీ సక్రమంగా రేషన్ సరుకులు అందించిన డీలర్ల పా త్ర వెలకట్టలేనిదన్నారు. పబ్బం గడుపుకునే మాటలతో కాలం వెల్లదీస్తున్న బీజేపీ నేత లు మనకు దక్కాల్సిన ఐటీఐఆర్, వ్యాగ న్స్ ఫ్యాక్టరీలను తెలంగాణకు రాకుండా చేసి న మోసాన్ని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి మొ దటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు పుస్తె శ్రీకాంత్, నాయకోటి రాజు, సంజీవ రె డ్డి, హైదరాబాద్, రంగారెడ్డిలకు చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు.