సారంగాపూర్లో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డి
సారంగాపూర్, ఏప్రిల్ 9: రైతుల అభ్యున్న తే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కౌట్ల(బి) పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు, సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్న ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని కొనియాడారు. క్వింటాల్ శనగలకు ప్రభు త్వం రూ. 5100 మద్దతు ధరను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ మల్లయ్య, అడెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, సర్పంచ్లు సుజాత, మురళీకృష్ణ, , ఏవో రాజశేఖర్రెడ్డి, మార్కెట్ సెక్రటరీ భూమన్న, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రాజేశ్వర్రావు, దత్తురాం, నర్సారెడ్డి, ముత్యం, దేవిశంకర్, ముత్యం, మాణిక్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు.