శ్రీశైలం: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్నారు. మొదటి కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసుకునేందుకు వచ్చిన ఆయన స్థానిక సదాశివ నిత్యాన్నదాన సత్రంలో బసచేశారు.