కాచిగూడ,ఆగస్టు 29 : గంగపుత్రులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంటకటేశ్ అన్నారు. హుస్సేన్సాగర్లో ఆదివారం నిర్వహించిన గంగపుత్ర తెప్పోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటకటేశ్..అంబర్పేట నియోజకవర్గం నుంచి వేలాది గంగపుత్రులు పాల్గొని బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు హుస్సేన్సాగర్లోని అమ్మవారిని దర్శిచుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడప శ్రీహరి, అంబర్పేట నియోజకవర్గం గంగపుత్ర సంఘం ప్రతినిధులు పూస నర్సింహ, స్వరూప, మెట్టు ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.