సిటీబ్యూరో, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ) : మింట్ కాంపౌండ్ ఆవరణలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంఘ భవనానికి శంకుస్థాపన చేయడం శుభపరిణామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందజేస్తానని, వచ్చే ఏడాది దసరాలోగా ప్రారంభోత్సవం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శుక్రవారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. శివాజీ మాట్లాడుతూ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ఇంజనీర్లది కీలకపాత్ర అన్నా రు. అసోసియేషన్ సొంత భవనానికి భూమిని కేటాయించి, తమను ముందుకు నడిపిస్తున్న మంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రెడ్కో ఎండీ జానయ్య, జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, సంఘం ప్రధాన కార్యదర్వి రామేశ్వరయ్య శెట్టి, బిల్డింగ్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.