చెరువులు, చెక్ డ్యామ్లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. కొండ పోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా నాచారం హల్దీవాగు వద్ద గోదావరి జలాలకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ చెక్ డ్యామ్ వద్ద సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పూజలు నిర్వహించారు. మండుటెండల్లో పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి జనాలు పులకరించిపోతున్నారు. పరుగులు తీస్తున్న గోదారమ్మకు దండాలు పెట్టి కొందరు సంతోషపడుతుంటే.. మరికొందరు ఆ నీటిలో జలకాలాడుతూ సరదాగా గడుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా