నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21 : జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ కృషి ఎనలేనిదన్నారు. తెలంగాణ తొలి, మలిదశ పోరాటంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి ప్రజలను ఏకం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జయశంకర్సార్ లేనిదే తెలంగాణ చరిత్ర లేదన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటుందన్నారు. జిల్లాకేంద్రంలోని కంఠేశ్వర్లో ఉన్న జయశంకర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి, హరీశ్యాదవ్, దండు శ్రీకాంత్, సందీప్ గోపాల్, సంజీవ్, జడ్పీటీసీ సుమనారెడ్డి, విశాలినీరెడ్డి, ఎనుగందుల మురళి, నుడా డైరెక్టర్ అక్తర్ పాల్గొన్నారు.
ధర్పల్లి ఎంపీపీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఎంపీపీ నల్ల సారికారెడ్డి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఎంపీడీవో నటరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, మండల పరిషత్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి, వార్డుసభ్యులు సురేశ్, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని పొతంగల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ శంకర్పటేల్, పొతంగల్ సర్పంచ్ వర్ని శంకర్, విండో చైర్మన్ శాంతేశ్వర్పటేల్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్ పాల్గొన్నా రు. చందూర్ మండలకేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సర్పంచ్ కర్లం సాయారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగాధర్చారి, నర్సింహాచారి, సంతోష్చారి, బలరాం, దత్తాద్రి, సదాశివచారి, రమేశ్చారి, రామ్సాగర్, రాజారెడ్డి, సాయిలు, హైమద్ పాల్గొన్నారు. వర్ని మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వబ్రాహ్మణుల సంఘం వర్ని మండల అధ్యక్షుడు పంచాక్షరి చారి, సత్యనారాయణ చారి, శ్రీనివాస్ చారి, టీఆర్ఎస్ నాయలు సతీశ్ కుమార్ చారి పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం కమాన్ వద్ద యువజన సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళావతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్, లోకాని గోపి, రజనీకాంత్ పాల్గొన్నారు. సిరికొండ మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి ఎంపీపీ మలావత్ సంగీతారాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్, ఎంపీడీవో లక్ష్మీప్రసాద్, సర్పంచులు లక్ష్మీనర్సయ్య, కనుక శ్రీనివాస్, గంగదాస్, సత్యానంద్, మల్లేశ్, తిరుపతి పాల్గొన్నారు.
బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని నిర్వహించారు. ఎంపీపీ బుద్దె సావిత్రి జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మాణిక్ వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, ఎంపీడీవో బానోత్ సుదర్శన్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సన్న, ఆయా గ్రామాల సర్పంచులు, శాఖల అధికారులు పాల్గొన్నారు. మోర్తాడ్లో దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్సార్ వర్ధంతిని నిర్వహించారు. మామిడిగంగాధర్, జాంభవ, రాజేశ్వర్, రవి, అనంతరావు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సార్ చిత్రపటానికి విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
రాజేశ్వర్, శ్రీధర్, బాలు, మహేందర్ పాల్గొన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్లోని జడ్పీ హైస్కూల్లో ప్రొఫెసర్ జయ శంకర్ సార్ వర్ధంతిని నిర్వహించారు. ఎంఈవో రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధ్ధంతిని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్లు తూము శరత్రెడ్డి, ధూప్సింగ్, జావిద్, శ్రీకాంత్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పి.గంగాధర్గౌడ్, ఎంఏ రజాక్, వల్లూరి రవిచంద్ర, నక్క లింగారెడ్డి, అశ్వాఖ్, యువజన విభాగం అధ్యక్షుడు శంకర్గౌడ్ ఉన్నారు. ఆర్మూర్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి జాగృతి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మక్కల సాయినాథ్, ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస బాలు, చంటి, సాయికుమార్, భూమేశ్, రాకేశ్, సురేందర్ పాల్గొన్నారు.