హైదరాబాద్: జోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ కేసులో అరెస్టయిన తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో మల్లన్నపై కేసు నమోదయింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఒక రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో మల్లన్నను సీసీఎస్ పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
లక్ష్మీకాంత శర్మ కేసులో అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్నను తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో చిలకలగూడ పోలీసులు, టాస్క్ఫోర్స్, క్రైంబ్రాంచ్ పోలీసులు నాలుగురోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మంగళవారం.. భారీ బందోబస్తు మధ్య మల్లన్నను చంచల్గూడ జైలుకు తరలించారు.