సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సైబర్క్రైమ్ ఠాణా పోలీసులు చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను కోర్టు అనుమతితో ఒక రోజు కస్టడీలోకి తీసుకొని గురువారం విచారించారు. యువతి ఫొటోతో పాటు ఆమె గూర్చి అసభ్యకరంగా తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయడంపై బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తీన్మార్ మల్లన్నను విచారించి అనంతరం కోర్టులో హాజరుపరిచి, తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు.