సిటీబ్యూరో,సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ): ప్రతి ఆదివారం ట్యాంక్బండ్పై సందర్శకులను కనువిందు చేస్తున్న ‘సండే-ఫన్డే’ కార్యక్రమం ఈ ఆదివారం మరింత ఆకర్షణీయంగా నిర్వహించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కెస్ట్రా, ఒగ్గుడోలు నృత్యాలు, రాష్ట్ర పోలీసు బ్యాండ్ ప్రదర్శన, పటాకుల మోత మోగించనున్నారు. గత మూడువారాలు నగరవాసుల్లో కొత్త ఉత్సాహం నింపిన కార్యక్రమాలు ఈ ఆదివారం మరింత కొత్తదనంతో, ప్రత్యేకాకర్షణతో నిర్వహించనున్నామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.