హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో వ్యవసాయ రంగం పాత్ర కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు.
శనివారం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వర్చువల్ విధానంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రమేశ్ చంద్తో కలిసి గవర్నర్ తమిళి సై విద్యార్థులకు, పరిశోధకులకు పట్టాలు ప్రదానం చేసి మాట్లాడారు.
వ్యవసాయం, పాడిపశువులతో ఆదాయం పెరుగుతుందని అన్నారు. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి