హైదరాబాద్ : నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో చెత్త తొలగింపు పనులపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఉదయం పరిశీలించారు. నిన్న బేగంపేటలో పనులను పరిశీలించిన మంత్రి తలసాని, ఇవాళ బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ వద్ద నాలాలో చెత్త తొలగింపు పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయిన ప్రాంతాల ఫోటోలను, వివరాలను 9848021665 నంబర్కు వాట్సాప్ చేస్తే మరమ్మతులు చేస్తామని మంత్రి చెప్పారు. మంత్రి తలసాని వెంట నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పీ ప్రవీణ్య ఉన్నారు.