రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో కొవిడ్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మా ట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ కార్యాచరణ ప్రణాళికలను, ఏర్పాట్లను సీఎస్కు వివరించారు. 25వేల ఐసొలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, నిజామియా, గాంధీ, నేచర్ క్యూర్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గతేడాది చేసినట్లుగానే ఈ సారి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, గాంధీ వైద్యశాల సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.