తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 30: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని తెలుగు పిల్ల లు స్వర మాధుర్యంతో తెలుగు భాషా మాధుర్యాన్ని సంగీత ప్రియులకు పంచుతూ గానం చేయడం ఆనందంగా ఉందని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏ.రామలింగేశ్వరరావు అన్నారు. యువ కళావాహిని, బాలనాద వినోదం(యుఎస్ఏ) సంయుక్త ఆధ్వర్యం లో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో నాద వినోద మ్యూజిక్ అకాడమీ విద్యార్థులచే, అంతర్జాలం వేదికగా ఎస్పీ బాలు స్వర నీరాజనం కార్యక్ర మం కొనసాగింది. నాద వినోదం మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు మణి శాస్త్రి, ఫ్యాకల్టీ సభ్యులు డాక్టర్ అంజనీ ప్రసాద్ల పర్యవేక్షణలో సాగిన సంగీత విభావరిలో చిన్నారులు పలు తెలుగు పాటలను ఆలపించి బాలుకు స్వర నీరాజం సమర్పించారు. ప్రఖ్యా త సినీ సంగీత దర్శకులు కోటి పాల్గొని పిల్లలకు శృతి విషయంలో మెలకువలు నేర్పించారు. సినీ గేయ రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ స్వరం దేవుడు ఇచ్చిన వరంగా చెప్పారు. కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.