ముంబై: ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని ఆంక్షల నడుమ ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం లేదని ఆయన తెలిపారు. ఆటగాళ్లతో పాటు ఐపీఎల్తో సంబంధం ఉన్నవారంతా ఐసోలేషన్లో ఉండాలన్నారు. ఐపీఎల్ ఆటగాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని బీసీసీఐ డిమాండ్ చేసిందని, కానీ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 45 ఏళ్ల ఆంక్ష ఉందన్నారు. అయితే ఐసీఎంఆర్ కొత్త ఆదేశాలను జారీ చేస్తేనే, దాని ప్రకారం వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉందని మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. కేంద్ర సంస్థ నుంచి అనుమతి రాగానే మరింత ఉదృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ముంబైలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. కానీ అక్కడ ఉన్న బేస్ టీమ్స్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ మ్యాచ్లపై కొంత ఆందోళన నెలకొన్నది.