న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో గీతిక, పూనమ్, వింకా, అల్ఫియా తారన్నుమ్ సెమీఫైనల్స్ చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. 57కిలోల కేటగిరీలో పూనమ్ 5-0తో నజెర్కె సెరిక్(కజకిస్థాన్)పై అలవోక విజయం సాధించింది. పానిపట్ బాక్సర్ వింకా 5-0 కామిలో కమెలా(కొలంబియా)ను చిత్తు చేయగా, అల్ఫియా 5-0తో రెకా హాఫ్మన్(హంగేరి)పై గెలిచింది. మరోవైపు మనీశ్(75కి), సుమిత్(69కి) ప్రత్యర్థులపై విజయాలతో క్వార్టర్స్లోకి ప్రవేశించారు.