వెంగళరావునగర్, జూలై 1: నీవు అందంగా లేవు..లావుగా ఉన్నా వు..మరొక పెండ్లి చేసుకుంటానంటూ భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్కు చెందిన అష్రఫ్సుల్తానా, వహీదుద్దీన్ దంపతుల మూడవ కూతురు హలీమాబేగం(25)ను బోరబండ, స్వరాజ్ నగర్కు చెందిన అబ్దుల్ ఆసిఫ్(32)కు ఇచ్చి 2018, జూన్ 30న పెండ్లి చే శారు. వీరికి కుమారుడు అబ్దుల్ హబీబ్(2.5) ఉన్నాడు.. ఇప్పుడు భార్యను అందంగా లేవని, లావుగా ఉన్నావని వేధిస్తున్నాడు.. అలాగే శారీరంగా హింసిస్తున్నాడు.. భర్తకు తోడు అత్త బీబీ ఫాతిమా, మామ అబ్దుల్ జానీమియాలు కూడా వేధించడం మొదలు పెట్టారు.. దీంతో మనస్తాపం చెందిన హలీమాబేగం తల్లికి ఫోన్చేసి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.