నల్లగొండ : భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం తానేదారుపల్లిలో ఈ ఘటన జరిగింది. తానేదారుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి చంద్రశేఖర్ రెడ్డికి ఏడాది క్రితం నాగార్జునసాగర్కు చెందిన శాంతి అనే యువతితో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి కొంతకాలంగా భార్య పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో మనోవేదనకు గురైన చంద్రశేఖర్ రెడ్డి గ్రామ శివారులోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.