మాదాపూర్ : మాదాపూర్లోని హెచ్ఐసిసిలో సుచరిండియా ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అనే నూతన ప్రాజెక్టును సినీ నటి అక్కినేని సమంత ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి సమంత మాట్లాడుతూ … హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాల సరైన ప్రాంతం హైదరాబాద్ అని అన్నారు.
ఇందులో భాగంగా ఎన్నో నూతన ప్రాజెక్టులు, సంస్థలు నగరంలో విస్తరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సుచరిండియా సంస్థ చైర్మెన్, సీఈఓ లయన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ … దేశంలోనే హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఐటీ కారిడార్ నిలయంగా వైవిధ్యభరితమైన పరిశ్రమలు, ఫార్మాసిటీ రావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు, విమాన కనెక్టివిటీ ఉందని చెప్పారు. ఐటీ ఉద్యోగులకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న ప్రాంతం హైదరాబాద్ అనిన గర్వంగా చెప్పవచ్చని అన్నారు.
ఈ నూతన ప్రాజెక్టులను శంషాబాద్ వద్ద శాతంరాయ్ అనే చోట 2.5 ఎకరాల విస్తీర్ణంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇందులో గేటెడ్కమ్యూనిటీ పరిధిలో లగ్జరీ సూట్లు, స్టూడియో అపార్ట్మెంట్లతో పాటు క్లబ్హౌస్, ల్యాండ్ స్కేప్లు, పార్కులు వంటి వాటిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు.