కాచిగూడ,ఫిబ్రవరి 4: విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఓయూ సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రిసెర్చ్, డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.కరుణాసాగర్ అన్నారు. బర్కత్పుర అవంతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో కళాశాల 2020-22(ఎంబీఏ)2019-22(ఎంసీఏ)విద్యార్థులకు స్నాతకోత్సవాన్ని ఓయూ ఆడిటోరియంలో నిర్వహించారు. అనంతరం ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.కార్యక్రమంలో జీఎంఆర్ ఈసీఓ సౌరబ్కుమార్, రవికుమార్, అవంతి విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ప్రియాంక, డైరెక్టర్(హెచ్ఆర్) వై.జయప్రద పాల్గొన్నారు.