హైదరాబాద్ : తెలంగాణ అసంఘటిత కార్మికుల బోర్డ్ చైర్మన్గా ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. లోయర్ ట్యాంక్బండ్లోని పింగళి వెంకటరమణ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దేవేందర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంది. దేవేందర్ రెడ్డికి తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడంతో ఉమ్మడి మెదక్ జిల్లాకు దక్కిన ఘనతగా భావిస్తున్నామని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం దేవేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పార్టీ కోసం పని చేసిన వారికి సరైన సమయంలో సముచితమైన స్థానం దక్కుతుందన్నారు. ఉద్యమకారులకు కూడా సరైన అవకాశాలు వస్తాయన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. నిండు వేసవిలోనూ హల్దీ వాగు మత్తడి దుంకుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఒక్క చెరువుకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. త్వరలో సంగమేశ్వరం లిఫ్ట్ పూర్తి చేసుకుంటామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో నారాయణ్ఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగునీళ్లు అందిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, న్యాయవాదిగా పని చేసిన దేవేందర్ రెడ్డి ఇవాళ అసంఘటిత కార్మికుల బోర్డ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పదవులు అందరికి వస్తాయి,కొంత లెట్ అయిన ఇవాళ దేవేందర్ రెడ్డికి పదవి వరించిందని తెలిపారు.