హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రభుత్వం రేపటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వైన్స్ దుకాణాల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరడం కనిపిస్తున్నది.
కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా దుకాణాల ఎదుట పోగవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుకాణాల ఎదుట రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు ధరించని వారిని వెనక్కు పంపుతున్నారు. భౌతికదూరం పాటించాలని మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.