హైదరాబాద్ : జంట నగరాల్లో లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 99 శాతం మంది ప్రజలు లాక్డౌన్ పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిత్యం 8 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయని, 7 వేలకుపైగా వాహనాలను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆయన మెహదీపట్నంలోని రైతుబజార్, పోలీస్ చెక్పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెహదీపట్నం రైతు బజార్లో ఏ ఒక్కరికీ కొవిడ్ సోకలేదని స్పష్టం చేశారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు. అపోహలు సృష్టించే వారిపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుటుందని ఆయన హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.