సిటీబ్యూరో, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : మహిళలు, పిల్లల రక్షణే మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీ పడేది లేదని సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తానని చెప్పారు. పోలీసు కమిషనర్గా బుధవారం సాయం త్రం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ కారిడార్, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. స్టీఫెన్ రవీంద్రకు బాధ్యతలు అప్పగించిన సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీసు కమిషనర్గా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్కు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.