బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తూ చరిత్ర సృష్టించబోతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వైజేఆర్ గార్డెన్, బడంగ్పేట లోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హజరయ్యారు .
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్ని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేవేస్తున్నా మన్నారు. ఈనెల 25న మాదాపూర్లో టీఆర్ఎస్ ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న ప్లీనరీలకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆమె పిలుపు నిచ్చారు.
గ్రామ, మండల, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, నియోజక వర్గం, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను కేంద్రంలో అమలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ హన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్పేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్స్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.