శ్రీశైలం, ఆగస్టు 5 : లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైల భ్రమరాంబదేవికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి దేవాలయ 113వ వార్షికోత్సవం సందర్భంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కో క్షేత్రాన్ని ఒక్కో సంవత్సరం దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్ర్తాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తొలి బోనం శ్రీశైల భ్రమరాంబదేవికి సమర్పించేందుకు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. శుక్రవారం ఉదయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారు జి.మహేశ్గౌడ్, కే.విష్ణుగౌడ్, జే.లక్ష్మీనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి బి.మారుతి యాదవ్, కోశాధికారి జి.అరవింద్ కుమార్గౌడ్, చంద్రకుమార్, సురేశ్బాబు ఉన్నారు.