సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి , సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): పిల్లలు ఆటలు బాగా ఆడాలి.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధాకృష్ణ చౌహాన్ తెలిపారు. సైదాబాద్లోని బాలుర వసతి గృహంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పిల్లలందరికీ పలు ఆట వస్తువులను పంపిణీ చేశారు. పిల్లలు శారీరకంగా ఎదగడానికి ఆటలు దోహదపడుతాయని, బాగా చదువుకొని మంచి దారిలో నడవాలని కార్యదర్శి సూచించారు. బాలుర వసతి గృహం ఇన్చార్జికి పలు సూచనలు ఇస్తూ, పిల్లలను బాగా చూసుకోవాలని, పిల్లలకు క్రమశిక్షణ, బాధ్యతలను నేర్పాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం ఇన్చార్జి నాగేశ్వర రావు, అధికారులు రాజేందర్, టిస్ ప్రతినిధులు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రతినిధులు, పారా లీగల్ వలంటీర్ సత్యనారాయణ రాజు, న్యాయవాది రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.